సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు

Published Mon, Oct 7 2019 5:32 AM

Govt on FIR against 49 celebrities who wrote to PM on mob lynching - Sakshi

న్యూఢిల్లీ: మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని  మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని పలు పార్టీలు,  సంఘాలు ఖండించాయి. కేసును వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమీ డిమాండ్‌ చేశాయి.  అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శనివారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement