అమ్మాయిలను అనుమతించాల్సిందే: హైకోర్టు | girls should be allowed, says allahabad high court | Sakshi
Sakshi News home page

అమ్మాయిలను అనుమతించాల్సిందే: హైకోర్టు

Nov 14 2014 7:58 PM | Updated on Aug 31 2018 8:26 PM

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గ్రంథాలయంలోకి అమ్మాయిలను కూడా అనుమతించాల్సిందేనంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గ్రంథాలయంలోకి అమ్మాయిలను కూడా అనుమతించాల్సిందేనంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అమ్మాయిలను అనుమతిస్తే ఇప్పుడు వస్తున్నదానికి నాలుగు రెట్లు ఎక్కువగా అబ్బాయిలు వస్తారంటూ వ్యాఖ్యానించిన వైస్ ఛాన్స్లర్ జమీరుద్దీన్ షా ఈ విషయంలో సమాధానం ఇవ్వాలనికూడా కోర్టు ఆదేశించింది.

ఈ విషయాన్ని సుమోటోగా తీసుకునేందుకు నిరాకరించిన హైకోర్టు.. ఓ పిల్ దాఖలు చేయడంతో దానిపై విచారణ చేపట్టింది. న్యాయ విద్యార్థిని, సామాజిక కార్యకర్త దీక్షా ద్వివేదీ ఈ పిల్ దాఖలు చేశారు. మహిళా విద్యార్థినుల పట్ల ఏఎంయూ వైస్ ఛాన్స్లర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగడంతో, అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఏఎంయూ వర్గాలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement