కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం | Four militants, soldier killed | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

Jun 17 2016 3:16 AM | Updated on Sep 4 2017 2:38 AM

కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్‌ధార్ సెక్టార్‌లో గురువారం మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు...

* చొరబాటు యత్నం భగ్నం
* ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి

శ్రీనగర్: కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్‌ధార్ సెక్టార్‌లో గురువారం మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా సైనికులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మిలిటెంట్లు హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్ల అక్రమ చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.

మంగళవారం కుప్వారా జిల్లా  మాచిల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా జవాన్లు భగ్నం చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్ హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement