చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు మృతి | Four of family killed as jeep falls into pond | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు దుర్మరణం

Jan 2 2018 3:23 PM | Updated on Aug 30 2018 4:17 PM

జైపూర్‌ : జీపు చెరువులో పడి నలుగురు మృతిచెందిన సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజాము దాటిన తర్వాత జరిగింది. మధుర నుంచి అల్వార్‌కు తిరిగి వెళ్తుండగా డ్రైవర్‌ జీపుపై అదుపు కోల్పోవడంతో చెరువులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఇంద్ర జైన్‌(38), పవన్‌ జైన్‌(40), అతని భార్య మనీషా(38), వారి ఏడేళ్ల వయసున్న కుమార్తె ప్యారి చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement