ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది! | Flight makes emergency landing after windshield crack | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది!

Jun 15 2014 11:13 AM | Updated on Sep 2 2017 8:51 AM

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది!

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది!

గాల్లో ప్రయాణిస్తుండగానే విండ్ షీల్డ్ పగిలిపోవడంతో రాయల్ భూటాన్ ఎయిర్ లైన్ విమానాన్ని అత్యవసరంగా కోల్ కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించివేశారు.

కోల్ కతా: గాల్లో ప్రయాణిస్తుండగానే విండ్ షీల్డ్ పగిలిపోవడంతో రాయల్ భూటాన్ ఎయిర్ లైన్ విమానాన్ని అత్యవసరంగా కోల్ కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించివేశారు.  
 
పారో నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో అత్యవరస ల్యాండింగ్ కు కెప్టెన్ ఏటీసీ అనుమతిని కోరాడు. ఏటీసీ  అనుమతి లభించడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. 
 
ఈ ఘటన ఉదయం 9.30 గంటలకు జరిగింది. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement