పడవ బోల్తా : ఐదుగురి గల్లంతు | Five missing in boat capsize | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా : ఐదుగురి గల్లంతు

May 15 2016 12:25 PM | Updated on Apr 4 2019 5:25 PM

పశ్చిమబెంగాల్ బుద్వాన్ జిల్లాలో కల్నా సమీపంలోని భగీరథీ నదిలో శనివారం రాత్రి పడవ బోల్తా పడింది.

బుద్వాన్: పశ్చిమబెంగాల్ బుద్వాన్ జిల్లాలో కల్నా సమీపంలోని భగీరథీ నదిలో శనివారం రాత్రి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరబ్ శర్మ వెల్లడించారు. కల్నాలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని వారంతా నడియా జిల్లాలో శాంతిపూర్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో చాలా మంది ఉన్నారని... వారిలో చాలా మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement