టింబర్ డిపోలో అగ్నిప్రమాదం: 8మంది మృతి | Five die in Maharashtra fire | Sakshi
Sakshi News home page

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం: 8మంది మృతి

Dec 27 2014 11:04 AM | Updated on Apr 4 2019 5:24 PM

భీవండిలో శనివారం ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.

థానే(ముంబై): మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భీవండిలో శనివారం ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.  తెల్లవారుజామున టింబర్ డిపోలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. డజను ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement