ఢిల్లీలో స్వల్ప భూకంపం

Earthquake tremors felt in Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై ఇది 3.5గా నమోదైంది. భూప్రకంపనలతో జనం  ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగెత్తారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలోని వజీరీబాద్‌లో 8 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ(ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.  నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి వార్తలు వెలువడలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top