బీజేపీ క్షమమాపణ చెప్పాలి: సీపీఐ | CPI says BJP elected Mallya to RS, asks it to apologise | Sakshi
Sakshi News home page

బీజేపీ క్షమమాపణ చెప్పాలి: సీపీఐ

May 13 2016 8:27 PM | Updated on Sep 4 2017 12:02 AM

విజయ్ మాల్యాను రాజ్యసభ ఎంపీని చేసినందుకు జాతికి బీజేపీ క్షమాపణ చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది.

న్యూఢిల్లీ: విజయ్ మాల్యాను రాజ్యసభ ఎంపీని చేసినందుకు జాతికి బీజేపీ క్షమాపణ చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యా ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని పేర్కొంది.

ఎంపీ పదవిని అడ్డుపెట్టుకునే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రూ. 9 వేల కోట్లు ఎగనామం పెట్టి మాల్యా విదేశాలకు పారిపోయారని అన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 4న మాల్యా చేసిన రాజీనామాను చైర్మన్ హమిద్ అన్సారీ ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement