విజయ్ మాల్యాను రాజ్యసభ ఎంపీని చేసినందుకు జాతికి బీజేపీ క్షమాపణ చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాను రాజ్యసభ ఎంపీని చేసినందుకు జాతికి బీజేపీ క్షమాపణ చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యా ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని పేర్కొంది.
ఎంపీ పదవిని అడ్డుపెట్టుకునే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రూ. 9 వేల కోట్లు ఎగనామం పెట్టి మాల్యా విదేశాలకు పారిపోయారని అన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 4న మాల్యా చేసిన రాజీనామాను చైర్మన్ హమిద్ అన్సారీ ఆమోదించారు.