రాజస్ధాన్‌లో మేజిక్‌ మార్క్‌కు చేరువగా కాంగ్రెస్‌ | Congress Leads In Rajasthan Assembly Polls | Sakshi
Sakshi News home page

రాజస్ధాన్‌లో మేజిక్‌ మార్క్‌కు చేరువగా కాంగ్రెస్‌

Dec 11 2018 2:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Leads In Rajasthan Assembly Polls - Sakshi

రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ జోరు

జైపూర్‌ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత నిలుపుకుంటూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 100 సీట్లు కాగా, కాంగ్రెస్‌ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్‌ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఈ దిశగా కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్‌ పైలెట్‌ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement