భారత్‌-పాక్‌ టెన్షన్‌: మళ్లీ స్పందించిన చైనా

China Again Calls for India and Pakistan to exercise restraint - Sakshi

బీజింగ్‌: భారత వైమానిక దాడులు.. ప్రతిగా పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల అంశంపై పొరుగుదేశం చైనా మరోసారి స్పందించింది. ఈ సమయంలో ఇరుదేశాలూ సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నట్టు పునరుద్ఘాటించింది. బీజింగ్‌లో సాధారణ విలేకరుల సమావేశంలో భాగంగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్‌ ఈ వ్యాఖ్య చేశారు. పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడం.. భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు పాక్‌ ఆర్మీ ప్రకటించడం.. మరోవైపు భారత్‌ దాయాదికి చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చేయడం.. తదితర పరిణామాలతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top