ఇక రైల్వే చార్జీల బాదుడు | centre mulls over train fare hike | Sakshi
Sakshi News home page

ఇక రైల్వే చార్జీల బాదుడు

Jun 20 2014 2:35 AM | Updated on Oct 4 2018 5:15 PM

ఇక రైల్వే చార్జీల బాదుడు - Sakshi

ఇక రైల్వే చార్జీల బాదుడు

సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ప్రజలపై వడ్డనకు సిద్ధమవుతోంది. రైలు చార్జీలను పెంచడానికి కసరత్తు మొదలుపెట్టింది. చార్జీల పెంపుతో పాటు రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) పచ్చజెండా ఊపాలని భావిస్తోంది.

న్యూఢిల్లీ: సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ప్రజలపై వడ్డనకు సిద్ధమవుతోంది. రైలు చార్జీలను పెంచడానికి కసరత్తు మొదలుపెట్టింది. చార్జీల పెంపుతో పాటు రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) పచ్చజెండా ఊపాలని భావిస్తోంది. చార్జీల పెంపు, ఎఫ్‌డీఐలపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాపై 6.5 శాతం మేర చార్జీలు పెంచాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రెండు రోజుల్లో సదానందగౌడ ప్రధాని మోడీ ముందుంచనున్నారు. జూలై రెండో వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే వీటిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రైల్వే అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలకు అనుమతివ్వాలని భావిస్తున్నట్టు సదానందగౌడ తెలిపారు.ఎఫ్‌డీఐల వల్ల  హైస్పీడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లు అభివ ృద్ధి చెందుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement