'జల్లికట్టుపై మేమేం చేయలేం..' | Central Govt can't issue ordinance on jallikattu, says nirmala sitharaman | Sakshi
Sakshi News home page

'జల్లికట్టుపై మేమేం చేయలేం..'

Jan 13 2016 8:03 PM | Updated on Aug 20 2018 9:16 PM

'జల్లికట్టుపై మేమేం చేయలేం..' - Sakshi

'జల్లికట్టుపై మేమేం చేయలేం..'

తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించే సంప్రదాయిక క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయలేదని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోజాలదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

న్యూఢిల్లీ: తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించే సంప్రదాయిక క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయలేదని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోజాలదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కావాలంటే జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేయవచ్చునని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జల్లికట్టుపై విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో గతంలో నిషేధించిన జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ జానపద క్రీడలో ఎద్దులు తీవ్ర హింసకు గురవుతాయని, ఈ అనాగరిక క్రీడను అనుమతించడం జంతుహక్కులను కాలరాయడమేనని జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జల్లికట్టుకు బ్రేక్ వేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. స్టేను తాత్కాలికంగా ఎత్తివేయాలని మరో పిటిషన్‌ వేసినా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement