నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు | CBI summons Nalini Chidambaram in Saradha scam | Sakshi
Sakshi News home page

నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు

Mar 4 2016 12:51 PM | Updated on Sep 3 2017 7:00 PM

నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు

నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరానికి శుక్రవారం సీబీఐ సమన్లు జారీచేసింది.

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరానికి శుక్రవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న కోల్కతాలోని సీబీఐ కార్యాలయానికి ఆమె హాజరు కావాల్సి ఉంది.

శారదా కేసుకు సంబంధించి గతంలో సీబీఐ నమోదు చేసిన ఆరో అనుబంధ చార్జ్ షీట్లో నళిని చిదంబరం పేరును ప్రస్తావించింది. అయితే ఈ కేసులో నిందితురాలిగా గానీ, సాక్షిగా గానీ నళిని పేరును ప్రస్తావించని సీబీఐ.. వివాదాస్పద చానెల్ ఒప్పంద విషయంలో ఆమె వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement