కార్టూనిస్టు గోపులు మృతి | cartoonist gopalan death | Sakshi
Sakshi News home page

కార్టూనిస్టు గోపులు మృతి

Apr 30 2015 2:09 AM | Updated on Sep 3 2017 1:07 AM

కార్టూనిస్టు గోపులు మృతి

కార్టూనిస్టు గోపులు మృతి

ప్రముఖ కార్టూనిస్టు గోపులు(ఎస్. గోపాలన్) మృతి చెందారు.

చెన్నై: ప్రముఖ కార్టూనిస్టు గోపులు(ఎస్. గోపాలన్) మృతి చెందారు. తమిళనాట గొప్ప చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా పేరొందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 27న ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 7.30 గంటలకు కన్నుమూశారు. ఆనంద వికటన్ పత్రికలో కార్టూనిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాతీయ స్థాయిలో కీర్తి సాధించారు. తమిళనాట పలు సీరియళ్లకు కూడా ఆయన పనిచేశారు. 1991లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో ఆయన్ను సత్కరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement