ఆమోదం తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

Bombay High Court Judges To Get Rs 50,000 Annually To Buy Spectacles - Sakshi

ముంబై: కళ్ళజోళ్లు కొనుగోలు చేసేందుకు బొంబాయి హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తికి సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన గవర్నమెంట్‌ రిసొల్యూషన్‌(జీఆర్‌)ను సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయి. ఈ జీఆర్‌పై జూలై 10 జిఆర్ న్యాయ సలహాదారు, జాయింట్ సెక్రటరీ యోగేశ్ అమేటా సంతకం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top