నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం | BJP's youth wing delegation visits Zhejiang in China | Sakshi
Sakshi News home page

నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం

Nov 15 2014 7:12 AM | Updated on Mar 29 2019 9:14 PM

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది.

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ భగత్‌సింగ్ కోషియారి నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం వారంపాటు చైనాలో పర్యటించనుంది. ఈ బృందానికి బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కన్వీనర్‌గా ఉన్నారు. సీపీసీ, బీజేపీ రాజకీయ వ్యవహారాలు, ఎజెండాలపై అవగాహన సహా పలు అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement