కరోనా: ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత

BJP spokesperson Sambit Patra hospitalised For Corona Symptoms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నేత, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంలో పరీక్షల కోసం గుర్‌గావ్‌లో‌ని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీనిపై  సంబిత్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. కరోనా పరీక్షల నిమిత్తం చేరినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఇక దేశంలో  కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. (24 గంటల్లో 194 మంది మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top