ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్‌ | biometric for govt employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్‌

Jun 8 2017 8:38 PM | Updated on Sep 5 2017 1:07 PM

ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్‌

ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్‌

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుంచి హాజరుని బయోమెట్రిక్‌ విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

♦ వచ్చే నెలలో అమల్లోకి
♦ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ:

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుంచి హాజరుని బయోమెట్రిక్‌ విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం ఎం.కుట్టీ గురువారం అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించారు. ఉద్యోగులందరూ కార్యాలయాల్లో విధిగా ఈ విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు.

ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ‍ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ విధిగా ఉదయం 9:30 గంటలకు కార్యాలయాల్లోకి రావాలని..అలాగే సాయంత్రం 6:30 గంటల వరకు కచ్చితంగా ఆఫీసుల్లో ఉండాలని పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల్లో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ విధానానికి మద్దతు తెలుపుతుండగా..మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగసంఘాల్లో ఐక్యత తీసుకురావడానికి గాను వచ్చే వారంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ‍ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement