నల్లధనం తెస్తానని చెప్పి మోదీ మోసం చేశారు
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇది గుణపాఠంగా మారాలని ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావటమే కాకుండా ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో తలపడుతున్న ఒకప్పటి తన అనుచరులు కేజ్రీవాల్, కిరణ్ బేడీల గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. బేడీ, కేజ్రీవాల్లపై తనకు ఎలాంటి కోపం లేదని.. వారి నుంచి ఏదీ ఆశించనప్పుడు కోపమెందుకు వస్తుందనానరు. ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై తనకు ఆసక్తి లేదన్నారు. పార్టీ రాజకీయాల ద్వారా ఎవరూ ఎలాంటి మార్పూ తీసుకురాలేరన్నారు. తనను ఆ గొడవల్లోకి లాగవద్దని తేల్చి చెప్పారు. లోక్పాల్ అంశంపై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం చేస్తానని హజారే తెలిపారు. ‘లోక్పాల్ చట్టంపై రాష్ట్రపతి సంతకం చేసి 365 రోజలైనా మోదీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదు’ అని అరోపించారు. ప్రభుత్వం అవినీతిని తీవ్రంగా పరిగణించడం లేదు కనుక లోక్పాల్, భూసేకరణ చట్టం తదితర అంశాలపై మళ్లీ ఆందోళన చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
మళ్లీ లోక్పాల్ ఉద్యమం: అన్నా హజారే
Published Thu, Jan 29 2015 3:38 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement