కరోనా: రేపు అమిత్‌ షా అఖిల పక్షం భేటీ | Amit Shah Calls All Party Meeting In Delhi Over Coronavirus Crisis | Sakshi
Sakshi News home page

కరోనా: రేపు అమిత్‌ షా అఖిల పక్షం భేటీ

Jun 14 2020 7:17 PM | Updated on Jun 14 2020 7:39 PM

Amit Shah Calls All Party Meeting In Delhi Over Coronavirus Crisis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను సరిహద్దుగా కలిగి ఉన్న ఢిల్లీలో విస్తరిస్తున్న కరోనా కట్టడిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు నార్త్‌ బ్లాక్‌లో నిర్వహిస్తారు. ఢిల్లీ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీలను ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, సీఎస్‌, ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌, కరోనా నియంత్రణ నిబంధనలుపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవటం గమనార్హం. (పాజిటివ్‌ న్యూస్‌: 50 దాటిన రికవరీ శాతం)

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలు ఢిల్లీతో ఉ‍న్న సరిహద్దు మార్గాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రజల రాకపోకల వల్ల తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి. ఇక నోయిడా, ఘజియాబాద్‌ నగరాలతో పోల్చితే ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవటంతో ప్రయాణ పరిమితులను కొనసాగిస్తామని ఉత్తరప్రదేశ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. (మంత్రి నిర్లక్ష్యంపై సోషల్‌ మీడియాలో విమర్శలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement