పేలిన ఎయిరిండియా విమానం టైరు | Air India Plane Suffers Tyre Burst In Mumbai | Sakshi
Sakshi News home page

పేలిన ఎయిరిండియా విమానం టైరు

Mar 16 2016 8:09 AM | Updated on Aug 17 2018 6:15 PM

పేలిన ఎయిరిండియా విమానం టైరు - Sakshi

పేలిన ఎయిరిండియా విమానం టైరు

ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఆ సమయానికి విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు.

ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఆ సమయానికి విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్ ఎ320 విమానం దిగుతుండగా దాని టైరు పేలిపోయింది.

దాంతో విమానాన్ని టాక్సీవే వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఎమర్జెన్సీ చ్యూట్స్ ద్వారా ప్రయాణికులందరినీ దించేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరినీ దించేసిన తర్వాత విమానాన్ని టాక్సీవే లోకి తరలించారు. అయితే ఈ ఘటన కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులోని ప్రధాన రన్‌వేను మూసేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement