చదువుకు వయసు అడ్డం కాదని ఆ పెద్దాయన నిరూపించారు. తమిళనాడు జాతీయ రహదారుల శాఖలో పనిచేస్తున్న గుణశేఖరన్ (50) తన కొడుకుతో కలిసి పదోతరగతి పరీక్ష రాసి.. పాసయ్యారు కూడా!! రోడ్లు వేసే పని చేస్తున్న గుణశేఖరన్, పోలవకలి పాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతన్న ఆయన కొడుకు తమీజ్ ఇద్దరూ కలిసి పదోతరగతి పరీక్షలు రాశారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారమే వెల్లడయ్యాయి. తండ్రికి 500కు గాను 234 మార్కులు రాగా, కొడుకు ఏకంగా 459 మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు.
హైస్కూలు వరకు రాకుండానే చదువు వదిలేసిన గుణశేఖరన్ కొన్నేళ్ల క్రితం ప్రైవేటుగా ఎనిమిదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. రెండేళ్ల తర్వాత తన కొడుకుతో కలిసి ఇంటర్మీడియట్ కూడా రాస్తానని, దాంతో తనకు పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయని గుణశేఖరన్ ఆనందంగా చెబుతున్నారు.
50 ఏళ్ల వయసులో.. పదోతరగతి పాస్
Published Sat, May 24 2014 1:58 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ఇంత దారుణమా..
ఆస్తి కోసమే బాలిక హత్య
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
Advertisement