ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం | Action on Volkswagen after their written response, says anant gete | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం

Feb 4 2016 7:02 PM | Updated on Sep 3 2017 4:57 PM

ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం

ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం

తాము తప్పుచేసినట్లు రాతపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు.

న్యూఢిల్లీ: తాము తప్పుచేసినట్లు రాతపూర్వకంగా ఒప్పుకుంటే జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్‌లోని కాలుష్య ఉద్గారాల నియమాలకు అనుగుణంగా కార్లు రూపొందించలేదని ఆ కంపెనీ రాతపూర్వకంగా వెల్లడించాలన్నారు.  గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గతంలోనే ఆ కంపెనీ తన తప్పును ఒప్పుకుందని, ఇక రాతపూర్వకంగా, ఏదైనా డాక్యుమెంట్లోనైనా ఆ విషయాన్ని పేర్కొన్న తర్వాత ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు చేపడతామని చెప్పారు.

వాహనాలను వెనక్కి తీసుకోవాలని ఆ కంపెనీకి ఇదివరకే చెప్పామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించడానికి ఫోక్స్ వ్యాగన్ మోటార్ స్పోర్ట్ ఇండియా చీఫ్ శిరిష్ విస్సా నిరాకరించారు. కంపెనీ పేరు తిరిగి సంపాదించడానికి కార్లను తిరిగి తీసుకుని వాటి ఇంజన్లను మార్చి ఇస్తామని.. అవసరమైతే రీప్లేస్ చేస్తామని ఆ కంపెనీ అధికారులు గతంలోనే ప్రకటించారు. 3.23 లక్షల ఆడీ, స్కోడా, ఫోక్స్ వ్యాగన్ కార్ల పాత ఇంజన్ల స్థానంలో సరైన వాటిని అమర్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement