నలుగురు జైషే ఉగ్రవాదుల హతం | 4 terrorist killed in J&K’s Pulwama encounter | Sakshi
Sakshi News home page

నలుగురు జైషే ఉగ్రవాదుల హతం

Dec 30 2018 3:51 AM | Updated on Dec 30 2018 3:51 AM

4 terrorist killed in J&K’s Pulwama encounter - Sakshi

ఎన్‌కౌంటర్‌ ముగిశాక విజయదరహాసంతో సైనికులు

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాక్‌ నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. హన్జన్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా, అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులందరూ జైషే మహ్మద్‌ సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement