ఎదురు కాల్పుల్లో ముగ్గరు ఉగ్రవాదులు, జవాను మృతి | 2 Terrorists Killed And 1 Jawan Martyred In Encounter In Pulwama Village | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ముగ్గరు ఉగ్రవాదులు, జవాను మృతి

May 16 2019 8:27 AM | Updated on May 16 2019 9:01 AM

2 Terrorists Killed And 1 Jawan Martyred In Encounter In Pulwama village - Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో భద్రతా దళాలకు.. ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ ఆర్మీ జవాన్‌ వీరమరణం పొందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ విషయం గురించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘దాలిపోర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం వచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాము. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఒక ఆర్మీ అధికారి మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామ’ని తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో దాలిపొర ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement