చత్తీస్గఢ్లో చిరుత కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని జనావాసాల్లోకి వచ్చిన చిరుత కాంకేర్ గ్రామంలో హల్చల్ చేసింది.
కాంకేర్ : చత్తీస్గఢ్లో చిరుత కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని జనావాసాల్లోకి వచ్చిన చిరుత కాంకేర్ జిల్లా అమపరా గ్రామంలో హల్చల్ చేసింది. దాంతో చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. చిరుత దాడిలో 14 మందికి గాయాలయ్యాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన సీజీ పోలీసుల్ని సైతం చిరుత ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు పోలీసులు చిరుతను తుపాకీతో కాల్చి చంపడంతో కాంకేర్ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ఏడు గంటల పాటు చిరుత చుక్కలు చూపించింది.
చిరుత నిన్న సాయంత్రం నుంచే గ్రామంలో సంచరించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దాంతో చిరుత సంచారంపై వారు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముందుగా చిరుత ఓ విలేకరి నివాసంలోకి దూకింది. అక్కడ నుంచి దాన్ని తరిమేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిపై దాడి చేసింది.