నిర్మాతగా మారిన మరో యంగ్ హీరో | Young Hero Sundeep Kishan Turns Producer | Sakshi
Sakshi News home page

Nov 23 2018 3:45 PM | Updated on Sep 15 2019 12:38 PM

Young Hero Sundeep Kishan Turns Producer - Sakshi

డిఫరెంట్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ స్టార్ ఇమేజ్‌ ను మాత్రం అందుకోలేకపోయాడు. హీరోగా కోలీవుడ్ లో కాస్త పరవాలేదనిపించుకున్నా టాలీవుడ్‌ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు కునాల్‌ కోహ్లీ డైరెక్షన్‌లో నెక్ట్స్‌ ఏంటి సినిమా చేస్తున్న ఈయంగ్ హీరో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఈ జనరేషన్‌ హీరోలు నటనతో పాటు నిర్మాతలుగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే బాటలో సందీప్‌ కిషన్‌ కూడా తన సూపర్‌ హిట్ సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ పేరు వచ్చేలా వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారాడు. తానే స్వయంగా హీరోగా నటిస్తూ ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను నిర్మిస్తున్నాడు.తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement