రెండో సారి | Varalakshmi Sarathkumar on board for `Maari 2` | Sakshi
Sakshi News home page

రెండో సారి

Dec 31 2017 2:11 AM | Updated on Dec 31 2017 2:11 AM

Varalakshmi Sarathkumar on board for `Maari 2` - Sakshi

హీరోగా చేయబోతున్న 37వ సినిమాతో రెండోసారి మెగా ఫోన్‌ పట్టనున్నారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్‌. రాజ్‌ కిరణ్‌ లీడ్‌ రోల్‌ చేసిన ‘పవర్‌ పాండి’ చిత్రం దర్శకుడిగా ధనుష్‌కి మొదటి సినిమా. బాక్సాఫీసు వద్ద డీసెంట్‌ హిట్‌ తెచ్చుకున్న ఈ సినిమా సీక్వెలే దర్శకుడిగా ధనుష్‌కి రెండో సినిమా అవుతుందన్న ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపించాయి. అయితే.. ఆ ఊహాగానాలు తప్పని తేల్చేశారాయన. ‘‘నా దర్శకత్వంలో రూపొందబోయే సినిమా గురించి వస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాను.

తేనాండాళ్‌ ఫిల్మ్‌ పతాకంపై నేను హీరోగా చేయబోతున్న సినిమానే నా రెండో డైరెక్షన్‌ ప్రాజెక్ట్‌’’ అని పేర్కొన్నారు ధనుష్‌. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ సినిమాకు సీక్వెల్‌ చేయనున్నారు ధనుష్‌.  బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్న ఈ సినిమా యూనిట్‌ లేటెస్ట్‌గా ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఎనౌన్స్‌ చేసింది. అంతేకాదు.. పదేళ్ల తర్వాత ధనుష్‌ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement