-
ధనుష్ శివభక్తి
రాజ్కిరణ్, రేవతి, ప్రసన్న, చాయాసింగ్ నటించిన పవర్ పాండి చిత్రం ద్వారా ధనుష్ దర్శకుడి అవతారం ఎత్తారు. తర్వాత నాగార్జున, శరత్కుమార్, శ్రీకాంత్, అతిథిరావు వంటి తారలతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్ గొప్ప నటుడనే విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఇతను పరమ శివభక్తుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ‘మగధీర’ తరహాలో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా చారిత్రాత్మకమైనదే. తెలుగులో అనేక మంది ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో చాలా చిత్రాల్లో నటించిన నాగార్జున.. ధనుష్ ఒకే రోజున అనేక సన్నివేశాలను అతి వేగంగా డైరెక్ట్ చేస్తున్న ప్రతిభకు ముగ్ధుడై మనసారా అభినందించారు. ఈ చిత్రం ప్రధానాంశం శివునిపై భక్తి ప్రపత్తులతో కూడింది కావడంతో ప్రతిరోజూ పూజలు, పునస్కారాలను ధనుష్ ఇంట్లోనే ముగించి షూటింగ్ స్పాట్కు వస్తున్నట్లు సమాచారం. -
మరోసారి కెప్టెన్ సీట్లో...
ఈ ఏడాది నటుడిగా హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’, నిర్మాతగా మామ రజనీకాంత్తో ‘కాలా’ చిత్రాలు చేశారు ధనుష్. ఇప్పుడు డైరెక్టర్గా తన సెకండ్ మూవీని స్టార్ట్ చేశారట ఈ మల్టీటాలెంటెడ్ హీరో. ‘పవర్ పాండి’ చిత్రం ద్వారా ధనుష్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధనుష్ ఓ కీలక పాత్ర చేశారు. దర్శకుడిగా తన మలి చిత్రంలో కూడా కీలక పాత్రతో సరిపెట్టాలనుకుంటున్నారట ధనుష్. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా. లీడ్ రోల్ కూడా చేస్తే డైరెక్షన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని ధనుష్ అనుకుంటున్నారట. నటుడిగా ధనుష్ చేసిన ‘ఎౖన్నై నోక్కి పాయుమ్ తోటా, మారి 2 , వడ చెన్నై’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నాయి. -
రెండో సారి
హీరోగా చేయబోతున్న 37వ సినిమాతో రెండోసారి మెగా ఫోన్ పట్టనున్నారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. రాజ్ కిరణ్ లీడ్ రోల్ చేసిన ‘పవర్ పాండి’ చిత్రం దర్శకుడిగా ధనుష్కి మొదటి సినిమా. బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్ తెచ్చుకున్న ఈ సినిమా సీక్వెలే దర్శకుడిగా ధనుష్కి రెండో సినిమా అవుతుందన్న ఊహాగానాలు కోలీవుడ్లో వినిపించాయి. అయితే.. ఆ ఊహాగానాలు తప్పని తేల్చేశారాయన. ‘‘నా దర్శకత్వంలో రూపొందబోయే సినిమా గురించి వస్తున్న రూమర్స్కు ఫుల్స్టాప్ పెడుతున్నాను. తేనాండాళ్ ఫిల్మ్ పతాకంపై నేను హీరోగా చేయబోతున్న సినిమానే నా రెండో డైరెక్షన్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ధనుష్. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ సినిమాకు సీక్వెల్ చేయనున్నారు ధనుష్. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకున్న ఈ సినిమా యూనిట్ లేటెస్ట్గా ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్కుమార్ను ఎంపిక చేసినట్లు ఎనౌన్స్ చేసింది. అంతేకాదు.. పదేళ్ల తర్వాత ధనుష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. -
నో వర్రీస్..!
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... ధనుష్ ఫుల్ హ్యాపీ. తల్లిదండ్రుల కేసు నిమిత్తం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కోర్టులో కేసు కొట్టేయడంతో హ్యాపీ. దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పవర్ పాండి’ సక్సెస్ కావడం మరో హ్యాపీ. మామ రజనీకాంత్ హీరోగా తాను నిర్మించనున్న సినిమా షూటింగ్ ఈ వారంలో ప్రారంభం కానుండడం ఇంకో హ్యాపీ. ఈ హ్యాపీనెస్ల మధ్య ధనుష్ హ్యాపీగా ఇంకో స్టెప్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఓ మలయాళం సినిమాకు సమర్పకుడిగా, 30 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, మరో మలయాళ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంకో వైపు హాలీవుడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద ధనుష్ లైఫ్లో ఇప్పుడు నో వర్రీస్. -
ధనుష్ సినిమా సీక్వల్లో సూపర్ స్టార్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటుడిగానే కాదు నిర్మాతమగా దర్శకుడిగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ తాజా పవర్ పాండీ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ సాధించాడు. వయసు మళ్లిన ఫైట్ మాస్టర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కిరణ్, రేవతిలు ప్రధాన పాత్రల్లో నటించారు. పవర్ పాండి సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ధనుష్. అయితే ఈ సీక్వల్లో రజనీకాంత్ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించిన ధనుష్. తరువాత తన దర్శకత్వంలో రజనీ హీరోగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే రాజ్ కిరణ్ చేసిన పాత్రలో రజనీ ఎంత వరకు సూట్ అవుతాడన్న అనుమాన్ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. పవర్ పాండీ తెలుగు రీమేక్ రైట్స్ ను మోహన్ బాబు సొంతం చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement