రెండు భాగాలుగా స్వీట్ మెమరీస్ | sweet memories movie in two parts going to be release | Sakshi
Sakshi News home page

రెండు భాగాలుగా స్వీట్ మెమరీస్

Feb 19 2014 11:14 PM | Updated on Sep 2 2017 3:52 AM

ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని, రామానాయుణ్ణి ఆదర్శంగా తీసుకుని, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టానని కేజీయస్ అర్జున్ అన్నారు.

 ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని, రామానాయుణ్ణి ఆదర్శంగా తీసుకుని, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టానని కేజీయస్ అర్జున్ అన్నారు. గత పదేళ్లుగా పలు చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ఆయన ఈ ఏడాది నిర్మాతగా మారుతున్నారు. అంజనీ ప్రొడక్షన్స్ పతాకంపై మూడు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం గోవర్ధన్ దర్శకత్వంలో ‘స్వీట్ మెమరీస్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి, ఒకేసారి విడుదల చేయబోతున్నాం. సునీల్ అనే కొత్త దర్శకుడితో ఓ భారీ చిత్రం నిర్మించనున్నాను. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జగపతిబాబు, జేడీ చక్రవర్తి, అమలాపాల్ నటిస్తారు. ప్రియాంకచోప్రాతో ఓ హిందీ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement