మా కష్టం తెరపై కనపడుతుంది

Suvarna Sundari team is super confident about the outcome - Sakshi

జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, రామ్, ఇంద్ర ముఖ్య తారాగణంగా దర్శకుడు ఎం.ఎస్‌.ఎన్‌ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ఉపశీర్షిక. ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో ఇంద్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్‌ కట్‌ చేసిన తర్వాత ఇంద్ర మాట్లాడుతూ– ‘‘టీమ్‌ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఉంది. దర్శక–నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది.

దర్శకుడు సూర్య చాలా హార్డ్‌వర్క్‌ చేశారు’’ అన్నారు హీరో రామ్‌. ‘‘టీమ్‌ పడిన కష్టం తెరపై తెలుస్తుంది. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు పూర్ణ. ‘‘నా కెరీర్‌లో స్పెషల్‌ చిత్రం ఇది. గ్లామర్, యాక్షన్, లవ్, థ్రిల్‌ ఇలా అన్ని అంశాలను దర్శకుడు సూర్య హైలైట్‌గా తెరకెక్కించారు’’ అన్నారు హీరోయిన్‌ సాక్షి. ‘‘ఇది టెక్నీషియన్స్‌ చిత్రం. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కథ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమా చేశాం. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్‌ వర్క్‌ ఉండటంతో సినిమా విడుదల లేట్‌ అయింది’’ అన్నారు సూర్య. ‘‘నటీనటుల కష్టం, దర్శకుడు సూర్య టేకింగ్‌ ఈ సినిమాకు ప్రధాన బలం’’ అన్నారు సంగీతదర్శకుడు సాయి కార్తీక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top