ఆ కథ చెప్పే తీరాలి! | Started paper work on Sabash Naidu: Kamal Haasan | Sakshi
Sakshi News home page

ఆ కథ చెప్పే తీరాలి!

Aug 31 2016 11:59 PM | Updated on Sep 4 2017 11:44 AM

ఆ కథ చెప్పే తీరాలి!

ఆ కథ చెప్పే తీరాలి!

కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’.

కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’. జూలై నెలాఖరున కమల్ ఆఫీసులో పోర్టికో కూలి కింద పడి, గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. శస్త్రచికిత్స తరువాత గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కమల్, ‘‘మళ్లీ సినిమా వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాను. రెడీ టు రన్ ద షో ఎగైన్. నా మనసు గాల్లో విహరిస్తోంది’’ అని పేర్కొన్నారు.

 ‘‘ఈ మధ్యకాలంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ కథను మీ అందరికీ చెప్పే తీరాలి. త్వరలో తప్పకుండా చెబుతా. డాక్టర్లు, శ్రేయోభిలాషులు.. అందరికీ థ్యాంక్స్’’ అన్నారాయన. అమెరికాలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో ‘శభాష్ నాయుడు’లో సుమారు అరవై శాతం షూట్ చేశారట. ఈ చిత్రంలో కమల్ కూతురిగా శ్రుతీహాసన్, భార్యగా రమ్యకృష్ణ, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement