బిగ్‌బాస్‌ హౌజ్‌.. ఇంకొంచెం మసాలా

Srinivas Reddy And Vennela Kishore Are Participating In Bigg Boss2 Show - Sakshi

తెలుగులో టాప్‌ షోగా దూసుకుపోతోంది బిగ్‌బాస్‌ రెండో సీజన్‌. ఏదైనా జరగవచ్చు, ఇంకొంచెం మసాలా అంటూ మొదలైన ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే మొదటి ఎలిమినేటర్‌గా బయటకు వచ్చిన సంజన, మిగతా పార్టిసిపెంట్స్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రతిరోజు జరిగే పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ‘జంబలకిడిపంబ’ టీమ్‌ కూడా పాల్గొనబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో శ్రీనివాస్‌ రెడ్డి, హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ ఈ రోజు షోలో కనిపించనున్నారు. వీరిద్దరు బిగ్‌బాస్‌ హౌజ్‌లో చేసే సందడి చూడాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. ‘జంబలకిడిపంబ’ సినిమా రేపు (జూన్‌ 22) విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top