పరమానందయ్య శిష్యులు

Sri Paramanandayya Sishyula Katha 3D Movie teaser launch - Sakshi

పింక్‌ రోజ్‌ సినిమాస్‌ పతాకంపై కాటంరెడ్డి సంతన్‌రెడ్డి, సిహెచ్‌ కిరణ్‌శర్మ నిర్మాతలుగా వెంకట రాజేశ్‌ పులి దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీ పరమానందయ్య శిష్యుల కథ’. ఈ త్రీడీ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం మారుతి  మాట్లాడుతూ– ‘‘చిన్నారుల కోసం ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని తీసిన చిత్రం ‘పరమానందయ్య శిష్యుల కథ’. ఈ చిత్రాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పరమానందయ్య కథలోని నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయటం కోసం ఈ చిత్రాన్ని త్రీడీ చేశాం. అన్ని  వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్, సంగీతం: యాజమాన్య.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top