మూడోసారి సల్మాన్‌తో..

మూడోసారి సల్మాన్‌తో..

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ దర్శకుడు కబీర్ ఖాన్ కాంబినేషన్లో మూడో సినిమా రానుంది. వీరిరువురి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ ఘన విజయం సాధించాయి. ఈ సారి కుటుంబ కథాచిత్రంతో వీరు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సుల్తాన్  సినిమా షూటింగ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే వీరి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ ల పేర్లు వినబడుతున్నాయి. రాజ్ కుమార్ సంతోషి, సూరజ్ భాటియాతో  సినిమాలు చేయడానికి సల్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top