ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ భావోద్వేగంతో సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సోదరుడే తన సర్వస్వమని తెలిపారు. ‘నా బలం, నా బలహీనత, నా గర్వం, నా సంతోషం, నా జీవితం, నా ప్రపంచం. నిన్ను, నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. వారి చెడు దృష్టి నీపై పడకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఇంకా ప్రకాశవంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నీ విజయం, మంచి పనులు నిన్ను ద్వేషించే వారిని అంధుల్ని చేయాలి. లవ్ యూ భాయ్’ అని ఆమె ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు.
కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో నమోదైన ఈ కేసుకు సంబంధించి జోధ్పూర్ న్యాయస్థానం గత గురువారం తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ జోధ్పూర్ సెంట్రల్ జైలులో రెండు రోజులు గడిపారు. ఆ తర్వాత బెయిలుపై బయటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో ఉన్నారు. తన తర్వాతి చిత్రం షూటింగ్కు కూడా ఆయన వెళ్లనున్నట్లు సమాచారం.
సల్మాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రంతో ఇటీవల మంచి హిట్ అందుకున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.570 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీని తర్వాత ఆయన ‘రేస్ 3’ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ హీరోగా ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘కిక్ 2’ సినిమాలు తెరకెక్కనున్నాయి.
ఇన్స్ట్రాగామ్లో సల్మాన్ సోదరి పోస్ట్..!
Published Mon, Apr 9 2018 11:57 PM
# Tag
Related news
-
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు
ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని పెళ్లాడిన ఆయుష్ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్ ఖాన్ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆయుష్ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్ చేశారు.నానా మాటలు..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలనుకున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..నన్ను శునకంతో పోల్చారునన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్.. తర్వాత సల్మాన్తో అంతిమ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.చదవండి: అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే? -
Lok sabha elections 2024: దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. ప్రజల మూడ్తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్సభ ఎన్నికల సీజన్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..! పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్లు.. ఆరు షేర్లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎక్స్’ ఫ్యాక్టర్! సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్ను 1.04 కోట్లు, ఆప్ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది. యూట్యూబ్లో ‘ఆప్’ షో పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్కు 5.3 లక్షలు, కాంగ్రెస్క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్కు 44.8 లక్షలు, తృణమూల్ను 5.91 లక్షల మంది సబ్్రస్కయిబ్ చేసుకున్నారు. ఎదురులేని మోదీ... సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్లో అత్యంత యాక్టివ్గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్లోనూ ఆయన క్రేజ్కు అద్దం పడుతోంది. ఇన్స్టాలో రాహుల్కు 68 లక్షలు, కేజ్రీవాల్కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం. ఇన్స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’ ఇన్స్టాగ్రామ్లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్ఫాంలైన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం. గత మూడు నెలల్లో ఈ ప్లాట్ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్కు 43 లక్షలు, ఆప్కు 12 లక్షలు, తృణమూల్కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ , యోగా వర్కౌట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)
Related News by category
-
శక్తులన్నీ ఏకమయ్యాయి
థియేటర్స్లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు మేకర్స్.మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఆ రోజే హరోం హర
సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్బాబు నటించిన ‘హరోం హర’ చిత్రం ఆ రోజే ధియేటర్లలోకి రానుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్గా ‘హరోం హర’ రూపొందింది. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ కథానాయికగా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఈ సినిమా కోసం సుధీర్ బాగా మేకోవర్ అయ్యారు. కథానుసారం కుప్పం స్లాంగ్లో డైలాగులు చె΄్పారు. ఈ వేసవి సెలవుల్లో మంచి యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఆ సాంగ్ హిట్ కాకుంటే.. ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేద్దామనుకున్నా: టాప్ హీరోయిన్
మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే. ఆ తర్వాత మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా వంటి సినిమాలతో దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సుమారు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. చివరగా 2013లో ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయింది.జీ5 వేదికగా మే3 నుంచి 'ది బ్రోకెన్ న్యూస్ 2' స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో తన పాత రోజులను మరొసారి గుర్తుచేసుకుంది. హీరోయిన్కు డ్యాన్స్ రాకపోతే ఇండస్ట్రీలో కొనసాగలేరనే అభిప్రాయం గతంలో చాలామందికి అభిప్రాయం ఉండేదని ఆమె పేర్కొంది. సినిమా రంగంలో అడుగుపెట్టే రోజుల్లో తనకు పెద్దగా డ్యాన్స్ రాదని తెలిపింది. దీంతో కొందరు కొరియోగ్రాఫర్స్ తిట్టేవారని ఆమె గుర్తుచేసుకుంది. వారి తిట్లు భరించలేక డ్యాన్స్లో ఎక్కువగా శిక్షణ తీసుకునేదానినని ఆమె తెలిపింది. మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చన 'బొంబాయి' సినిమాలో 'హమ్మా.. హమ్మా' సాంగ్లో అవకాశం వచ్చింది. కానీ, ఆ సమయంలో తనకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం ఉన్నట్లు పేర్కొంది. కొంతమేరకు శిక్షణలో ఉన్న సొనాలి.. ఆ పాటకు డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరంతో కలిసి ఆ పాటకు అదరిపోయే స్టెప్పులు వేసి మెప్పించాలని కోరుకున్నట్లు సొనాలి చెప్పింది. ఒకవేళ ఈ పాటలో తన డ్యాన్స్ నచ్చలేదంటే ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసి వెళ్లాలని కూడా ఫిక్స్ అయినట్లు తెలిపింది. ఫైనల్గా 'హమ్మా.. హమ్మా' సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆ పాటతో తన పేరు ట్రెండ్ అయినట్లు సోనాలి చెప్పుకొచ్చింది. -
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్బీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్ రిలీజ్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. సాంగ్ చాలా ప్రత్యేకంగా..పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు. చదవండి: లావైపోయా.. సడన్గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది!
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement