బిజీ అవుతున్న మాస్‌ మహారాజ్‌ | Sakshi
Sakshi News home page

బిజీ అవుతున్న మాస్‌ మహారాజ్‌

Published Mon, Apr 9 2018 12:11 PM

Raviteja Busy with New Movies - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ తిరిగి తన పాత బిజీ షెడ్యూల్‌లోకి వెళుతున్నాడు.  బెంగాల్‌ టైగర్‌ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్‌తో సత్తా చాటాడు.  కానీ మరోసారి టచ్‌ చేసి చూడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే టచ్‌ చేసి చూడు ప‍్రభావం రవితేజ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్టులతో జిజీగా ఉన్నాడు.  ఇప్పటికే కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టిక్కెట్టు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. త్వరలో అమర్‌ అ‍క‍్బర్‌ ఆంటోని షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా ఎటువంటి బ్రేక్‌ లేకుండా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసుకోబోతోంది.

ఈ సినిమా తరువాత  సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన తేరికి రీమేక్‌. కథనం పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయబోతున్నారు.  శ్రీను వైట్ల సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా తన రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకునే అవకాశం ఉంది. ఇలా వరుస సినిమాలు కమిట్‌ అవుతున్న రవితేజ వచ్చే ఏడాదిలో కూడా వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు.

Advertisement
Advertisement