థ్రిల్లర్‌కి సై | Rajasekhar to make comeback with emotional thriller | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌కి సై

Aug 20 2019 12:26 AM | Updated on Aug 20 2019 12:26 AM

Rajasekhar to make comeback with emotional thriller - Sakshi

ధనుంజయన్, శివప్రసాద్, రాజశేఖర్, జీవిత

‘పీఎస్‌వీ గరుడవేగతో హిట్‌ ట్రాక్‌ ఎక్కిన రాజశేఖర్‌ ప్రస్తుతం ఓ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నారు. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత డా. జి. ధనుంజయన్‌ నిర్మించనున్నారు. ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పుస్తక రచయితగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధనుంజయన్‌ సమంత నటించిన ‘యుటర్న్‌’ సినిమాతో పాటు విజయ్‌ ఆంటోని ‘కొలైకారన్‌’ వంటి చిత్రాలను తమిళంలో విడుదల చేశారు. ఇంకా ‘మిస్టర్‌ చంద్రమౌళి’, జ్యోతిక, లక్ష్మీ మంచుల ‘కాట్రిన్‌ మొళి’ చిత్రాలను నిర్మించారు.

ప్రస్తుతం విజయ్‌ ఆంటోనితో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు ధనుంజయన్‌. తెలుగు హిట్‌ ‘క్షణం’ను ‘సత్య’గా తమిళంలో రీమేక్‌ చేయడంతో పాటు ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘త్వరలో షూటింగ్‌ ఆరంభిస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సింగిల్‌ సిట్టింగ్‌లో కథను ఓకే చేసిన రాజశేఖర్‌కు కృతజ్ఞతలు’’ అని ధనుంజయన్‌ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యస్‌.పి. శివప్రసాద్, సంగీతం: సైమన్‌.కె. కింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement