‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

Rajasekhar Donates Ten Lakhs To MAA - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని భావించిన డాక్టర్ రాజశేఖర్... తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. 

ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోందని, ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నామని 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్ చెప్పారు. చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మా అధ్యక్షుడు నరేష్‌పై మా సభ్యులు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు బయటకు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) స్పందించి.. తమలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కి, రాజశేఖర్‌ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top