మార్పు రావాలి | R Narayana Murthy New Movie Market lo Prajaswamyam | Sakshi
Sakshi News home page

మార్పు రావాలి

Jun 2 2019 12:47 AM | Updated on Jun 2 2019 12:47 AM

R Narayana Murthy New Movie Market lo Prajaswamyam - Sakshi

ఆర్‌. నారాయణమూర్తి

‘‘మన దేశంలో ఓట్లు అమ్ముడుపోతున్నాయి. పేరుకే ప్రజాస్వామ్యం. పదవుల్లో ఉన్నవారు ప్రజాసేవ గురించి కాకుండా సంపాదనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఈ విషయాలనే ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమాలో చూపించాం’’ అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఓటు హక్కు ఎంతో విలువైనది అంటుంటారు. అలాంటి ఓట్లనే కొంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారు. ఈ అంశాలనే మా చిత్రంలో ప్రస్తావించాం. ప్రజల్ని ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఆడియోకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజాకవులు రాసిన ప్రతి పాటకూ మంచి ఆదరణ లభిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా చెబుతాం’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement