కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు | Pragya Jaiswal select to raviteja movie | Sakshi
Sakshi News home page

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

Apr 24 2017 12:19 AM | Updated on Sep 5 2017 9:31 AM

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

‘కంచె’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’... చేసింది మూడు చిత్రాలే అయినా అందం,...

‘కంచె’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’... చేసింది మూడు చిత్రాలే అయినా అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగ్యా జైస్వాల్‌. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మాస్‌ మహారాజ రవితేజ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ వరించిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

విక్రమ్‌ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మంచనున్న ‘టచ్‌ చేసి చూడు’. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేయగా, రెండో కథానాయికగా ప్రగ్యాను తీసుకున్నారని తెలుస్తోంది. సెకండ్‌ హీరోయిన్‌గా లావణ్యా త్రిపాఠి పేరు వినిపించినా.. కట్‌ చేస్తే.. ఫైనల్‌గా ఆ అవకాశం ప్రగ్యాకు దక్కిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement