పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు | Police Arrest Uyyalavada Narasimha Reddy Heirs in Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

Sep 17 2019 10:57 AM | Updated on Sep 19 2019 8:25 PM

Police Arrest Uyyalavada Narasimha Reddy Heirs in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి మాట్లాడుతూ గత మే నెలలో స్వామినాయుడు, రాంచరణ్‌ పీఏ అవినాష్‌ తమను చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు పిలిపించి ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్‌ చేసి నోటరీ కూడా చేసి ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు.

గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో  తాము రాంచరణ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఇటీవల అతడి పీఏ అవినాష్‌ మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు.  తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటరీ  చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement