పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త కుంపటి పెట్టెందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఈ నెల 30న జరగబోయే 'మెగా ఫ్యాన్స్ డే' అన్నదమ్ముల అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. దాంతో పవన్ అభిమానులు....సొంతంగా అభిమాన సంఘం ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే అభిమానుల సమావేశం నిర్వహించి రాష్ట్రస్థాయిలో అభిమాన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు జిల్లా పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ తెలిపాడు.
'పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత' పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందు కోసం ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానుల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాజమండ్రి లేదా విజయవాడ వేదిక కానుంది. ఇక ఈనెల 30 జరిగే మెగా అభిమానుల సమావేశానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కిరణ్ తెలిపాడు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు అతను పేర్కొన్నాడు. మరోవైపు మెగాస్టార్ అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. రాజకీయంగా పవన్ని వ్యతిరేకిస్తాం తప్ప.. చిరంజీవి సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామని చెప్పటం విశేషం.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త కుంపటి!
Published Mon, Sep 8 2014 11:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement