సినిమాల పైరసీ నేపథ్యంలో.. 

Naveen Chandra and Gayatri Suresh new movie with Karthik Reddy - Sakshi

నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్ ’.స్వాతి పిక్చర్స్‌ పతాకంపై భార్గవ్‌ మన్నె నిర్మించిన ఈ చిత్రానికి ‘అడ్డా’ ఫేమ్‌ జి.కార్తీక్‌ రెడ్డి దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. భార్గవ్‌ మన్నె మాట్లాడుతూ– ‘‘సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ ఇది. తను అనుకున్న పాయింట్‌ను చక్కగా తెరకెక్కించాడు కార్తీక్‌. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం టీజర్‌ ఇటీవల విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.నవీన్ చంద్ర యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవ ల్‌లో ఉంటుంది. పైరేటెడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top