దుబాయ్ లో 'ప్రిన్స్' ఫ్యామిలీ! | Sakshi
Sakshi News home page

దుబాయ్ లో 'ప్రిన్స్' ఫ్యామిలీ!

Published Fri, Jan 2 2015 11:56 PM

దుబాయ్ లో 'ప్రిన్స్' ఫ్యామిలీ!

టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు ఈసారి నూతన సంవత్సర వేడుకలను దుబాయ్ లో జరుపుకున్నారు. షూటింగ్ కు కొద్దిరోజులు విరామం ఇచ్చి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి అక్కడ కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. తన కుమారుడు గౌతమ్ తో కలిసి ఏడారిలో దిగిన ఫోటోను ఆమె పెట్టారు. ఈ వారంలోనే మహేష్ బాబు స్వదేశానికి తిరిగిరానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement