ప్రజల మనిషిగా కొనసాగండి : మహేష్ బాబు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం నమోదు చేసిన తెలంగాణ రాష్ట్రసమితి నాయకులపై శుంభాకాంక్షల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా విజేతలకు అభినందనలు తెలుపగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన స్నేహితుడు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపాడు.
‘ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీరు అన్ని రకాలుగా ఈ విజయానికి అర్హులు. ఇక ముందు కూడా ప్రజల మనిషిగా కొనసాగండి’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. చాలా కాలంగా మహేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్న కేటీఆర్.. భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
A big congratulations on the win @KTRTRS... A very well deserved one 👏🏻👏🏻
Continue to be the man of the people... Wishing you all the very best👍🏻👍🏻— Mahesh Babu (@urstrulyMahesh) December 11, 2018