మెగాస్టార్తో మహానటి!
సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత తెలుగులో మరే సినిమాకు అంగీకరించని కీర్తి తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్కు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చిరు. ఈ సినిమాలో చిరుకు జోడిగా కీర్తి సురేష్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ముందుగా ఈ పాత్రకు నయనతార, అనుష్క లాంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఫైనల్గా కీర్తి అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. మరి కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెపుతుందా లేదా చూడాలి.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు