హీరో రాజశేఖర్‌ సంచలన నిర్ణయం

Hero Rajasekhar Resigned His Executive Vice President Of MAA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్‌లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’  ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..
గురువారం ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘మా’లో మారోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు రాజశేఖర్‌ మాట్లాడిన తీరు, అంశాలపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు.  అంతేకాకుండా ‘మా’నియమనిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా జీవితరాజశేఖర్‌ సైతం తన భర్తది చిన్నపిల్లల​ మనస్తత్వంగా పేర్కొనడం విశేషం. 

చదవండి: 
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్‌
‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం

​​​​​​​

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top