జూలై 5న గోపిచంద్‌ ‘పంతం’

Gopichand Pantham Will Be Released On 5th July - Sakshi

ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన హీరో గోపిచంద్‌. కానీ గత కొంత కాలం పాటు సరైన విజయాలు లేక వెనుకపడ్డారు. గోపిచంద్‌ ప్రస్తుతం పంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (జూన్‌ 12) గోపిచంద్‌ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 

ఇప్పటికే విడుదలైన పంతం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌లోని డైలాగ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను  శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మించగా,  కె. చక్రవర్తి దర్శకత్వం వహించారు. గోపిచంద్‌కు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top